
న్యూఢిల్లీ/డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ గుడి తలుపులు ఆదివారం తెరుచుకోనున్నాయి. ఉదయం 6:15 నిమిషాలకు ఆలయ ప్రధాన పూజారి ఈశ్వర ప్రసాద్ నంబూద్రి పూజలు నిర్వహించి గుడిని తెరుస్తారు. ఇందుకోసం గుడిని పూలమాలలతో, లైట్లతో అలంకరించారు. సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం సాయంత్రం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించున్నట్లు బద్రీనాథ్ టెంపుల్అధికారులు తెలిపారు. రోజూ 15 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు చెప్పారు. బద్రీనాథ్తో కలిపి చార్దామ్గా పేర్కొనే యమునోత్రి, గంగోత్రి, కేదరినాథ్ ఆలయాలు ఇప్పటికే తెరుచుకున్నాయి. అక్షయ తృతియ సందర్భంగా ఈ నెల 3 నుంచే చార్దామ్ యాత్ర మొదలైంది.