కొడుకు పానం బాగయితలేదని తండ్రి ఆత్మహత్య

కొడుకు పానం బాగయితలేదని తండ్రి ఆత్మహత్య

గజ్వేల్, వెలుగు: అనారోగ్యానికి గురైన కొడుకు కోలుకోవటంలేదన్న బెంగతో సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం నాచారానికి చెందిన నర్సింలు అనే వ్యక్తి చెరువులో దూకి చనిపోయాడు. హైద్రాబాద్​ ఎర్రగడ్డకు చెందిన గొర్రె నర్సింలు  కొంత కాలంగా తన భార్య రేణుక ఊరైన నాచారంలో ఉంటున్నాడు. వీరి పెద్ద కొడుకు అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ట్రీట్​మెంట్​ ఇప్పిస్తున్నా నయం కావడంలేదని నర్సింలు ఎప్పుడూ బాధ పడుతుండేవాడు. శనివారం సాయంత్రం  ఇంటి నుంచి  వెళ్లిన నర్సింలు తిరిగిరాలేదు. ఎంత వెతికినా అతని జాడ తెలియలేదు. సోమవారం సాయంత్రం నాచారంలోని వెంకటాయి చెరువులో నర్సింలు మృతదేహం తేలింది. భార్య రేణుక ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

For More News..

బిడ్డ పుట్టిందని డివోర్స్ అడిగిన జవాన్

144 సెక్షన్​లో వివక్ష.. మీడియాకు, ప్రతిపక్షాలకు నో పర్మిషన్

నాలాలపై నిర్మాణాలు కూల్చకుండా స్టే తెచ్చుకుంటున్న జనాలు