
- ఐదు జంటల కథ
యమ్.యన్.వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఆగస్టు 29న సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ను హీరో శివాజీ విడుదల చేశారు. టైటిల్, కాన్సెప్ట్ బాగున్నాయని, సినిమా ఘనవిజయం సాధించాలని శివాజీ బెస్ట్ విషెస్ చెప్పారు. దర్శకనిర్మాత సాగర్ మాట్లాడుతూ ‘ఐదు జంటల మధ్య జరిగే సంఘర్షణలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే ట్విస్టులతో రూపొందించాం.
నూతన నటీనటులతో యూత్ ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం. సెకండ్ హాఫ్లో శివుడి మీద వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అని చెప్పారు. శృతి శంకర్ , వికాస్ , విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల , రోహిత్ కొండ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.