విశాఖలో తొలి డెల్టా ప్లస్ కేసు

విశాఖలో తొలి డెల్టా ప్లస్ కేసు

విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో తొలి డెల్టా ప్లస్ కేసు గురువారం నమోదైంది. జీవీఎంసీ జోన్ 1 పరిధిలో ఉన్న  విశాఖపట్నం జిల్లా మధురవాడ వాంబేకొలనీలో డెల్టా ప్లస్ మొదటి కేసు నమోదు కావడం కలకలం రేపింది. మధురవాడ పి.హెచ్.సి. పరిధిలోని డోర్ నెంబర్ 20A/జీఎఫ్-3 నివాసి పాడి.మేరీ (51) అనే మహిళకు పి.హెచ్.సి ఆరోగ్య సిబ్బంది టెస్ట్ చేయడంతో పాజిటివ్ వచ్చింది. దీంతో శాంపిల్స్ ను హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు. ఈమె శాంపిల్ ను హైదరాబాద్ ల్యాబ్ టెస్ట్ చేసి డెల్టా ప్లస్ గా నిర్ధారించారు. దీంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. వాలంటీర్ల సహాయంతో ఆమె ఇంటితోపాటు చుట్టు పక్కల శానిటేషన్ చేశారు. ఆమె ఇంటివైపు ఎవరూ రాకుండా బారికేడ్లతో పరిసర ప్రాంతాలను మూసివేశారు.