
మెట్ పల్లి, వెలుగు: పెళ్లి మండపం రిపబ్లిక్ డే వేడుకలకు వేదికగా మారింది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు జాతీయ జెండా ఆవిష్కరించి తమకు దేశం, రాజ్యాం గంపై ఉన్న గౌరవాన్ని చాటి చెప్పారు. జగిత్యా ల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన వాసవి, భార్గవ్ పెళ్లి ఆదివారం జరిగింది. పెళ్లి వేడుకకు ముందు మండపం వద్ద వధూవరులు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం అందరికి స్వీట్స్ పంచిపెట్టారు.