గ్రూప్ 1 రద్దు తీర్పును సవాల్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం

గ్రూప్ 1 రద్దు తీర్పును సవాల్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం

గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్‌ మోషన్‌ అనుమతి కోరింది. మంగళవారం (సెప్టెంబర్ 26వ తేదీన) విచారణ జరిపేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అంగీకరించింది. గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ సెప్టెంబర్ 23వ తేదీన హైకోర్టు సింగిల్‌ బెంచ్ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుతో అభ్యర్థులతోపాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశామని, మూడోసారి రాయడమంటే తట్టుకోలేని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ప్రిలిమినరీ పరీక్ష అంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని కమిషన్‌ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ అప్పీలు చేసింది.

Also Read : 28వ తేదీ వరకు హైదరాబాద్ మొత్తం ఉరుములు, మెరుపులతో వర్షం