హెబ్బా పటేల్, రామ్ కార్తీక్ జంటగా విప్లవ్ కోనేటి దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’. శుక్రవారం నుంచి ‘ఆహా’ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో హెబ్బా పటేల్ మాట్లాడుతూ ‘ఇదొక మిస్టరీ థ్రిల్లర్. అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ మదనపల్లిలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. సస్పెన్స్, డ్రామా, రొమాన్స్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అన్నాడు. నరేష్, రామ్ కార్తీక్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.