- 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
- ఇయ్యాల్టి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల (పీజీటీ) ఫలితాలను గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అంతేకాకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను బోర్డు ప్రకటించింది. శని, ఆదివారాల్లో వివిధ సబ్జెక్టుల పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని తెలిపింది.
శనివారం ఉదయం 9 గంటలకు పీజీటీ హిందీ, ఆదివారం ఉదయం 9 గంటలకు పీజీటీ సోషల్ స్టడీస్, మ్యాథ్స్, బయాలాజికల్ సైన్స్ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని వెల్లడించింది. పీజీటీ హిందీ అభ్యర్థుల సర్టిఫికెట్లను చైతన్యపురిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజీ ఫర్ విమెన్, పీజీటీ సోషల్ అభ్యర్థుల సర్టిపికెట్లను బంజారాహిల్స్(రోడ్నంబర్ 10)లోని బంజారా భవన్, పీజీటీ మ్యాథ్స్
బయాలజీ అభ్యర్థుల సర్టిఫికెట్లను బంజారాహిల్స్ (రోడ్ నంబర్ 10)లోని కుమ్రం భీం ఆదివాసీ భవన్లో పరిశీలిస్తామని పేర్కొంది. రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలిచినట్టు తెలిపింది. పీజీటీ హిందీకి 327 మంది, పీజీటీ సోషల్ స్టడీస్కు 415
మ్యాథ్స్కు 459, బయాలజీకి 326 మందిని ఎంపిక చేసింది. కాగా, వెరిఫికేషన్కు వచ్చే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన రెండు సెట్ల జిరాక్స్ సర్టిఫికెట్లను తీసుకురావాలని బోర్డు వెల్లడించింది. ఏ సర్టిఫికెట్ మిస్ అయిన వెరిఫికేషన్కు అనుమతించమని స్పష్టం చేసింది.