న్యూఢిల్లీ: స్వదేశీ ఆటో కంపెనీలు టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా (ఎం&ఎం) మాత్రం డీజిల్ సెగ్మెంట్పై ఆశలను వదులుకోలేదు. ఎక్కువ డిమాండ్ కారణంగా మరికొన్ని కంపెనీలు కూడా వీటి బాటలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డీజిల్ ఇంజన్ల తయారీకి కఠినమైన రూల్స్ రావడం, వీటి ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉండటం వల్ల మారుతీ సుజుకీ, రెనాల్ట్–నిస్సాన్, ఫోక్స్వేగన్ గ్రూపులు వీటి జోలికి వెళ్లడం లేదు. బీఎస్–6 ఎమిషన్ రూల్స్ రెండవ దశకు మారిన తర్వాత డీజిల్తో నడిచే వెహికల్స్ ధరలు ఇంకా పెరుగుతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) అమ్మకాలు బాగుండటం, గత మూడు సంవత్సరాల్లో దేశంలో డీజిల్ వెహికల్స్ ధరల పెరుగుదల వల్ల ఈ రెండు కంపెనీలు డీజిల్ఇంజన్లను వదిలిపెట్టడానికి ఇష్టపడటం లేదు.
ఫోక్స్వ్యాగన్ గ్రూప్ ఏప్రిల్ 2020 తర్వాత డీజిల్ బండ్లు తయారు చేయడమే మానేసింది. ఇండియా మార్కెట్లో మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ విక్రయాల్లో ఎస్యూవీల వాటా ఐదేళ్లలో 40శాతం వరకు పెరిగింది. 2021 ఆర్థిక సంవత్సరంలో మిడ్–-ఎస్యూవీ విభాగంలో డీజిల్ వేరియంట్ల వాటా 64శాతం, హై-ఎండ్ ఎస్యూవీలలో 94శాతం వాటా ఉంది. హై-ఎండ్ ఎస్యూవీలలో మిడ్–-ఎస్యూవీ విభాగంలో 50 శాతం వెహికల్స్ డీజిల్వే ఉన్నాయి. 2020 ఆర్థిక సంవత్సరం కార్ల విక్రయాలలో డీజిల్ వెహికల్స్ వాటా 29శాతం నుంచి 18శాతానికి పడిపోయింది. 2020 ఏప్రిల్ నుంచి భారతదేశంలో బీఎస్–6 రూల్స్ కావడంతో కంపెనీలు 42 హ్యాచ్బ్యాక్లు, సెడాన్లు, ఎంట్రీ ఎస్యూవీలలో డీజిల్ ఇంజన్ బండ్ల అమ్మకాలను ఆపేశాయి.