కొడుకులను చంపి పాతిపెట్టిన మతిస్థిమితం లేని వ్యక్తి

కొడుకులను చంపి పాతిపెట్టిన మతిస్థిమితం లేని వ్యక్తి

అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను చంపి పాతిపెట్టాడు. నిన్న రాత్రి ఘాతుకానికి పాల్పడిన విషయం ఇవాళ ఉదయం బయటపడింది. పిల్లలు కనిపించకపోవడంతో వారి కోసం గాలిస్తూ.. మతి స్థిమితం లేని తండ్రి  రవి ఏదో చేసి ఉంటాడని అనుమానించారు. ఇవాళ ఉదయం గ్రామ శివార్లలోని ముళ్ల కంపల మధ్య ఒక చోట పెద్ద గొయ్యి తవ్వి పూడ్చిపెట్టినట్లు గ్రామస్తులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చి తవ్వి చూడగా తండ్రి చేతిలో హతమైన ఇద్దరు చిన్నారులు ( కవల పిల్లలు) సుదీప్,(5) సుధీర్ (5) మృతదేహాలు బయటపడ్డాయి. కళ్యాణదుర్గం రూరల్ ఎస్ఐ సుధాకర్ చిన్నారులను చంపిన తండ్రి రవిని అదుపులోకి తీసుకున విచారణ చేపట్టారు.