మహాముత్తారం, వెలుగు : పోలీస్ఈవెంట్స్లో మృతి చెందిన లింగమల్ల మహేశ్అంత్యక్రియలు ఆదివారం ఉద్రిక్తతల మధ్య జరిగాయి. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన పోలీస్ఈవెంట్స్లో 1600మీటర్ల రన్నింగ్లో పాల్గొన్న మహేశ్లక్ష్యాన్ని పూర్తి చేసినా అస్వస్థతకు గురయ్యాడు. ఉస్మానియా హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ఆదివారం అతడి డెడ్బాడీని స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మహేశ్కుటుంబాన్ని ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్, బీఎస్పీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు. మహేశ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్చేశారు. డీజీపీని సస్పెండ్ చేయాలని, హోం మినిస్టర్ రాజీనామా చేయాలని, పోలీస్ రిక్రూట్మెంట్ను వెంటనే నిలిపివేయాలన్నారు. ఈవెంట్స్ జరిగే గ్రౌండ్ లో మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు లేకపోవడంతోనే అస్వస్థతకు గురై చనిపోయాడన్నారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోతున్నారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం జరిగి తోపులాటకు దారి తీసింది. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. క్రీడాకారులు, మహేశ్ స్నేహితులు అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. మంథని ఎమ్మెల్యేతో పాటు బీఎస్పీ లీడర్లు దాసరి హన్మయ్య, గొట్టె రాజు, దూడెపాక సుమన్, రామిళ్ల రాకేశ్ పాల్గొన్నారు.