‘హనుమాన్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో మైథలాజికల్ సూపర్ హీరో జానర్ మూవీ ‘మహాకాళి’. భూమి శెట్టి మహాకాళిగా, అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తోంది.
ప్రశాంత్ వర్మ షోరన్నర్గా వ్యవహరిస్తున్నారు. ఆర్కే దుగ్గల్ సమర్పణలో రిజ్వాన్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. ‘ది ఎండ్ బిగిన్స్’ అనే ట్యాగ్లైన్తో వస్తున్న ఈ సినిమాకు బుధవారం అప్డేట్ ఇచ్చారు. ఆగస్టు 24న ఫస్ట్ గ్లింప్స్ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ చిత్రంలో ఇంకా శ్రీయారెడ్డి, రోహిత్ సరాఫ్, ఖుష్బూ సుందర్, రాజేష్ బేడి, పోసాని మురళీ శర్మ, నాజర్, రజత్ కపూర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. స్మరణ్ సాయి సంగీతం సమకూరుస్తుండగా సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
