కన్నప్పలో చేరిన మరో ఇద్దరు లెజెండ్స్.. ఇండస్ట్రీలను కలిపేస్తున్న మంచు విష్ణు

కన్నప్పలో చేరిన మరో ఇద్దరు లెజెండ్స్.. ఇండస్ట్రీలను కలిపేస్తున్న మంచు విష్ణు

మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్ లో కనిపించనున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కన్నప్ప(Kannappa). భారీ బడ్జెట్ తో, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar singh) దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ భక్తి రస ప్రాజెక్ట్లో మరో ఇద్దరు డైనమిక్ యాక్టర్స్ జాయిన్ అవ్వబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో చాలా కీలకమైన పాత్రల కోసం మంచు మోహన్ బాబు(Mohan Babu), శరత్ కుమార్ (Sarath Kumar) లను తీసుకున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో..కచ్చితంగా మోహన్ బాబు ఉంటారని సినిమా మొదలైన నుంచే టాక్ వినిపిస్తోంది. ఇపుడు ఆ విషయాన్ని ప్రకటించడం కాస్త లేట్ అయింది అంతే. 

ఇక మరి లేటెస్ట్ న్యూస్ అంటే..తమిళ సీనియర్ యాక్టర్  శరత్ కుమార్ను కీలక పాత్ర కోసం తీసుకోవడం. హీరో శరత్ కుమార్ తనదైన నటనతో..తెలుగులో సుపరిచతమైన నటుడు. ప్రస్తుతం శరత్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయేలా ఉంది. పరంపర వెబ్ సీరిస్ తో దుమ్ము దులిపేశాడు. ఇప్పుడు కన్నప్ప ప్రాజెక్టులోకి శరత్ కుమార్ కూడా ఎంటరవ్వడంతో..మరో స్టార్ బలం కన్నప్పకు తోడైంది.

ఇప్పటికే  ఈ ప్రాజెక్టు చాలా భారీగా తయారైంది.  ఈ భక్త కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర చాలా కీలకం. అందుకే ఈ సినిమాలో శివుడి పాత్ర కోసం..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను తీసుకున్నారని సమాచారం. ఇదే విషయాన్ని మంచు విష్ణు ఇండైరెక్ట్గా రివీల్ చేశారు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు శివుడి పక్కన పార్వతిగా లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అలాగే ఈ మూవీలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ భాగమయ్యారు. దీంతో అన్ని ఇండస్ట్రీ నటులను మంచు విష్ణు ఏకం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మోస్ట్ సీనియర్ రైటర్స్..పరుచూరి గోపాలకృష్ణ తో పాటు బుర్ర సాయిమాధవ్, తోట ప్రసాద్ ప్రాజెక్ట్ లో చేరి..కథకు మెరుగులు దిద్దారు. దీంతో కన్నప్ప కథ స్థాయి..అమాంతం పెరుగుతూ వస్తోంది.