జీవో నెంబర్ 46పై సీఎం రేవంత్ కు వినతిపత్రం.. మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలి

జీవో నెంబర్ 46పై సీఎం రేవంత్ కు వినతిపత్రం.. మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలి

పోలీసు ఉద్యోగాల భర్తీలో జీవో నెంబర్ 46పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు వినతిపత్రం అందించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. జీవో నుంచి కోడ్ నెంబర్ 24 TSSP(5000) మినహాయించాలని కోరారు. నిరుద్యోగుల ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. CD1,CD2 ప్రకారం ఫలితాలు ప్రకటించి... మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పారు. 

తప్పుడు ప్రశ్నలను తొలగించి.. మళ్లీ ఫలితాలు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును అమలు జరిగేలా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. చాలా జిల్లాల్లో మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేసి.. నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుందూరు జై వీర్ రెడ్డి, పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బాలు నాయక్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, మందుల సామ్యూల్, బత్తుల లక్ష్మారెడ్డి సంతకం చేసిన లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు.