2024 కల్లా 10వేల సినిమా హాళ్లను నిర్మించాలని టార్గెట్

2024 కల్లా 10వేల సినిమా హాళ్లను నిర్మించాలని టార్గెట్

2024 నాటికల్లా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,000 సినిమా థియేటర్లని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ సీఎస్ సీ ఈ- గవర్నెన్స్ సర్వీసెస్ నిర్ణయం తీసుకుంది. దీనికోసం అక్టోబర్ సినిమాస్ తో పార్టనర్షిప్ తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ రెండు సంస్థల మధ్య జరిగిన ఒప్పందంలో గ్రామీణ ప్రాంతాల్లో 100-200 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఒక లక్ష సినిమా హాళ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 

దేశంలో వినోద రంగం అభివృద్ధి చెందుతోంది. దీనివల్ల ఈ సీఎస్ సీ సినిమా హాళ్లు వాణిజ్య హబ్ లుగా మారుతాయి. అందుకు గ్రామాల్లోని చిన్న ఆంత్రప్రెన్యూర్లకు అవకాశాలు ఇవ్వబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్ల కాన్సెప్ట్ చాలా కొత్తదైనప్పటికీ, ఇది సక్సెస్ అవుతుందని సీఎస్ సీ ఎండీ సంజయ్ కుమార్ రాకేష్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  అయితే, దీనికోసం విలేజ్ ఆంత్రప్రెన్యూర్లు రూ. 15 లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.