ప్రభాస్‎ని ఎలా చూడాలనుకుంటున్నారో.. అలా చూపించబోతున్నా్: డైరెక్టర్ మారుతి

ప్రభాస్‎ని ఎలా చూడాలనుకుంటున్నారో.. అలా చూపించబోతున్నా్: డైరెక్టర్ మారుతి

ప్రభాస్‌‌‌‌‌‌‌‌ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’. సోమవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌‌‌‌‌‌‌‌లో  కనిపిస్తూ ఇంప్రెస్ చేశాడు. హారర్ ఎలివేషన్స్, ఫన్నీ డైలాగ్స్‌‌‌‌‌‌‌‌తో సాగిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.  ప్రభాస్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే  ఫస్ట్ టైమ్ ఇలాంటి జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న  చిత్రం కావడంతో మరింత క్యూరియాసిటీ పెరిగింది. హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటించిన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ లుక్స్ ఆకట్టుకున్నాయి. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, సముద్రఖని, సప్తగిరి, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.  టీజర్ లాంచ్ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘ప్రభాస్ గారితో సినిమా అంటే మొదట చాలా మంది నన్ను ఎగతాళి చేశారు.

ఎవరు ఏమన్నా..  ప్రభాస్ గారు మాత్రం నా వెనుక నిలబడ్డారు. నన్ను బాగా నమ్మారు. అందుకే  ఈ చిత్రాన్ని  ఒక చాలెంజ్‌‌‌‌‌‌‌‌గా తీసుకుని చేస్తున్నా.  ఆయన ఇమేజ్‌‌‌‌‌‌‌‌కు ఏమాత్రం డ్యామేజ్ రాకుండా చూసుకున్నా. టీజర్ చూశాక అందరూ బాగుందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే సాంగ్స్,  ట్రైలర్, మూవీ ఎలా ఉంటాయో మీరు ఊహించలేరు. ప్రభాస్ గారిని ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించబోతున్నాం. ఆయనలో ఒక స్పెషల్ కామెడీ టైమింగ్ ఉంటుంది.  దానిని అందరూ  ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తూనే ఉంటుంది. మా సంస్థ నుంచి వచ్చిన కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఆ లోటును "ది రాజా సాబ్"  భర్తీ చేస్తూ అతి పెద్ద విజయాన్ని సాధించబోతోంది’ అని అన్నారు.  క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్,  సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళని పాల్గొన్నారు.