రాజ్యసభకు ఇద్దరు టీఆర్ఎస్​ సభ్యులు ఏకగ్రీవం!

రాజ్యసభకు ఇద్దరు టీఆర్ఎస్​ సభ్యులు ఏకగ్రీవం!

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల స్ర్కూటిని తరువాత రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నట్లు సీఈఓ కార్యాలయం బుధవారం ప్రకటించింది. టీఆర్​ఎస్​ అభ్యర్థులు దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి నామినేషన్లు ధ్రువీకరించిన అధికారులు.. వారిద్దరు చెరో స్థానానికి బరిలో ఉన్నట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల విత్​ డ్రాకు మూడో తేదీ వరకు గడువు ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. విత్​ డ్రా గడువు  ముగిసిన తరువాత ఇద్దరు సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.