జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లా లో పాకిస్థాన్ విమానం సింబల్ కలిగి ఉన్న ఓ బెలూన్ కనిపించడం కలకలం సృష్టించింది. దానిపై పీఐఏ(పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్) అని రాసి ఉంది. భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కథువా జిల్లా హీరానగర్శివారులో కనిపించిన ఈ బెలూన్ నలుపు, తెలుపు రంగుల్లో ఉంది. అప్రమత్తమైన భద్రతా బలగాలు బెలూన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కునే పనిలో ఉన్నారు.
గత అనుభవాలు.. నివురుగప్పిన నిప్పులా పరిస్థితులు
ఇటీవల జమ్మూలో ని రాజౌరీ ప్రాంతంలో భద్రతా బలగాల చేతిలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఇదే ఏడాది ఫిబ్రవరిలో సిమ్లాలోని ఓ యాపిల్ తోటలో గ్రీన్, వైట్ కలర్కలిగిన బెలూన్ విమానం కనిపించింది. దానిపై కూడా పాక్ ఎయిర్ పోర్ట్ సింబర్ ఉంది. మే 20 న అమృత్సర్లోని దాయాది దేశానికి చెందిన ఓ డ్రోన్ని కూల్చివేశారు. అప్పడు మత్తు పదార్థాలు ఉన్న బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతాదళ సిబ్బంది చెప్పారు. అంతకుముందు నాలుగు పాకిస్థాన్ డ్రోన్లను బీఎస్ఎఫ్ అడ్డుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే భారత్ పాక్ సరిహద్దులో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉందంటున్నారు విశ్లేషకులు.