కొలంబో: హింసాత్మకంగా మారిన నిరసనలను అణిచేయడానికి శ్రీలంక ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూను పొడిగించింది. రాజధాని కొలంబోలో ఆర్మీ బలగాలను దించింది. అల్లర్లు జరగకుండా వీధుల్లో సైనికులు గస్తీ నిర్వహిస్తోంది. సామాన్యుల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. మాజీ ప్రధాని మహింద మద్దతుదారులు దాడి చేయడంతో నిరసనకారులు రెచ్చిపోయారు. మంత్రులు, ఎంపీలు, రాజకీయ నేతల ఇండ్లపై దాడులు చేసి, వాహనాలు, ఇండ్లు తగలబెట్టారు. దీంతో నిరసనలను అణిచేయడానికి ఆర్మీకి, పోలీసులకు రక్షణ శాఖ ఎమర్జెన్సీ పవర్స్ కట్టబెట్టింది. వారెంట్ లేకుండా ఎవరినైనా అదుపులోకి తీసుకునే అధికారమిచ్చింది. మరోవైపు, ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రధాని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కు నోటీసులు పంపి, ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు. మరోవైపు, ప్రధాని పదవికి మహింద రాజీనామా చేయడంతో ఆయన కేబినెట్ కూడా రద్దయింది. దీంతో దేశం సైనిక పాలనలోకి వెళుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని రక్షణ శాఖ సెక్రెటరి గుణరత్నె కొట్టిపారేశారు. తర్వాతి ప్రధాని కోసం ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స ప్రతిపక్ష నేతలతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు.
కొలంబో వీధుల్లో బలగాల గస్తీ
- విదేశం
- May 12, 2022
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ