మేడారం భక్తులకు శుభవార్త

మేడారం భక్తులకు శుభవార్త

హైదరాబాద్: మేడారం భక్తులకు శుభవార్త. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాలను మీసేవ కేంద్రాల ద్వారా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భక్తుల సౌకర్యార్థం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రసాద సేవను ప్రారంభించామని మీసేవ కేంద్రాల జిల్లా మేనేజర్ గులాం గఫార్ అహ్మద్ తెలిపారు. ప్రసాదం కావాల్సిన భక్తులు మీసేవ కేంద్రాల్లో రూ.225 చెల్లించి ప్రసాదాన్ని ఆర్డర్ చేస్తే.. కొరియర్ ద్వారా ప్రసాదం నేరుగా దరఖాస్తుదారు చేసిన వారి చిరునామాకు పంపిస్తామన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తల కోసం:

ఎవడెట్లపోయినా.. మీరు మాత్రం సల్లగుండాలె

రూ.100 కోట్లతో ఐటీ టవర్స్కు సర్కారు శ్రీకారం