
జీడిమెట్ల, వెలుగు: ప్రియుడు పెట్టే వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్ చేసుకుంది. జీడిమెట్ల పోలీసులు తెలిపిన ప్రకారం... షాపూర్నగర్పరిధి ఎన్ఎల్ బీ నగర్కి చెందిన అఖిల ప్రియ (22) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా ఆమెను షాపూర్నగర్కి చెందిన ఓరుగంటి అఖిల్సాయిగౌడ్ ప్రేమిస్తున్నానని వెంటపడుతూ చనిపోతానంటూ బెదిరించాడు. దీంతో అతని ప్రేమను ఆమె ఒప్పుకుంది.
ప్రేమ విషయం యువతి ఇంట్లో చెప్పగా పెద్దలు కూడా అంగీకరించారు. అనంతరం ఆమెను సాయిగౌడ్మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఆమెను ఫోన్లో తిట్టడడం, అందరి ముందు కొట్టడం చేస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన అఖిల ప్రియ ప్రేమ పేరుతో మోసగించాడని సూసైడ్నోట్రాసి మంగళవారం రాత్రి ఉరేసుకుని చనిపోయింది. యువతి తండ్రి కుమార్కంప్లయింట్ తో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.