
సూర్యాపేట జిల్లాలో భారీ ఏటీఎం చోరీ జరిగింది... జిల్లాలోని హుజూర్ నగర్ లో లింగగిరి రోడ్డులో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. ఆదివారం ( జూన్ 1 ) అర్థరాత్రి 2 :30 గంటల సమయంలో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అర్థరాత్రి ఫార్చూనర్ కార్ లో వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్లతో ఏటీఎం ని ధ్వంసం చేసి రూ. 20 లక్షలు దోచుకెళ్లారు.
నగదు దొంగలించిన తరువాత ఎటిఎం కి నిప్పు పెట్టి వెళ్లారు దుండగులు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ఇటీవల కాలంలో ఎస్బీఐ ఏటీఎంలలోనే ఎక్కువ చోరీలు జరుగుతుండటం గమనార్హం.. ఆ మధ్య రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం పగలగొట్టి చోరీ చేశారు దొంగలు. కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు సీసీకెమెరాలు, సైరన్ ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. కేవలం నాలుగు నిమిషాల్లోనే ఏటీఎం పగలగొట్టి డబ్బును తీసుకొని పారిపోయారు.
మార్చి 2న తెల్లవారు జామున రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఎస్ బీఐ ఏటీఎంలో చోరీ చేశారు దొంగలు. ముందుగా సీసీ కెమరాలకు స్ర్పేకొట్టి , ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. కట్టర్, ఇనుప రాడ్లతో ఏటీఎంను బద్దలు కొట్టారు. కేవల నాలుగు నిమిషాల్లోనే డబ్బులతో పారిపోయాయి. రెండు రోజుల క్రితం ఏటీఎం రూ. 30లక్షలు పెట్టినట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు.