దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ వేగంగా పెరుగుతున్నాయి. ఇవాళ్టి వరకు కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 961కి చేరింది. దీనికి సంబంధించిన వివరాలను ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయన్నారు. మొత్తం 961 కేసులు రాగా.. అందులో 320 మంది పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఎనిమిది జిల్లాల్లో వీక్లీ కరోనా పాజిటివిటీ రేటు 10 శాతాన్ని మించిపోయిందని, ఇందులో ఆరు జిల్లాలు మిజోరం రాష్ట్రంలో ఉండగా, మిగిలిన రెండు పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. వీక్లీ పాజిటివిటీ రేటు 5 నుంచి పది శాతం మధ్య 14 జిల్లాల్లో నమోదవుతోందన్నారు.
The weekly positivity rate of more than 10% is being noted in 8 districts including 6 districts from Mizoram, one from Arunachal Pradesh, Kolkata in West Bengal. The weekly case positivity rate is between 5-10% in 14 districts: Luv Aggarwal, Joint Secretary, Union Health Ministry pic.twitter.com/SvpSEFN1wg
— ANI (@ANI) December 30, 2021
ఓవరాల్ పాజిటివిటీ రేటు 0.92 శాతం
గడిచిన వారం నుంచి దేశంలో ప్రతి రోజూ 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని లవ్ అగర్వాల్ చెప్పారు. డిసెంబర్ 26 నుంచి రోజూ 10 వేలకు పైగా కేసులు వస్తున్నాయన్నారు. అయితే ఓవరాల్ పాజిటివిటీ రేటు 0.92 శాతమే ఉందన్నారు.
రాష్ట్రాల వారీగా ఒమిక్రాన్ కేసులు
రాష్ట్రం కేసుల సంఖ్య
ఢిల్లీ 263
మహారాష్ట్ర 252
గుజరాత్ 97
రాజస్థాన్ 69
కేరళ 65
తెలంగాణ 62
తమిళనాడు 45
కర్ణాటక 34
ఆంధ్రప్రదేశ్ 16
హర్యానా 12
వెస్ట్ బెంగాల్ 11
మధ్యప్రదేశ్ 9
ఒడిశా 9
ఉత్తరాఖండ్ 4
చండీగఢ్ 3
జమ్ము కశ్మీర్ 3
ఉత్తరప్రదేశ్ 2
గోవా 1
హిమాచల్ ప్రదేశ్ 1
లడఖ్ 1
మణిపూర్ 1
పంజాబ్ 1