కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్ (SalaarCeaseFire). ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ నెట్టింట వైరల్ అవుతూ..మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే అప్పుడే అన్నిరకాల అనుమతులు కోసం ప్రభుత్వ అధికారుల్ని సంప్రదించే పనిలో పడ్డారట నిర్మాతలు. ఇప్పటికే నిర్మాతలు తెలంగాణా,ఆంధ్రాలలో దరఖాస్తు చేసారు. ఆ మేరకు డాక్యుమెంట్స్ సమర్పించినట్లు సమాచారం. టికెట్ ధరని 50 నుంచి 75 రూపాయలు పెంచుకునే సౌలభ్యం కల్పించి.. ఐదు షోలు అనుమతులు వచ్చేలా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారట. అధికారుల నుంచి కూడా సానుకూలంగా స్పందన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటును రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపిస్తూ వచ్చాయి. ఇందుకు ప్రత్యేక కమిటీ సూచనల మేరకు నిర్ణయించనున్నట్లు గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది సంక్రాంతికి భారీ బడ్జెట్తో నిర్మించిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్వహకులు దరఖాస్తు చేసుకున్నప్పుడు వీరికి సానుకూల స్పందనే వచ్చింది. అలాగే ఆదిపురుష్ సినిమా టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి తెలంగాణ,ఆంధ్రా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. దీంతో సలార్ విషయంలో కూడా టిక్కెట్ల రేటు పెంచే అవకాశం ఉంది.
ఇప్పటికే సలార్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ బాగా ఆకట్టుకున్నాయి.ఇటీవల మేకర్స్ ట్రైలర్ ట్రైలర్ డేట్ను లాక్ చేయగా..ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ మోస్ట్ వెయిటింగ్ ట్రైలర్ వచ్చే నెల 1 డిసెంబర్ 2023న రాత్రి 7:19 గంటలకు రిలీజ్ కానుంది.