క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు బ్యాడ్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌

క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు బ్యాడ్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌

మెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ మధ్య జరిగే టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు బ్యాడ్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌. ఆదివారం మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌లో భారీ వర్షం పడే చాన్స్‌‌‌‌‌‌‌‌ 95 శాతం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రిజర్వ్‌‌‌‌‌‌‌‌ డే అయిన సోమవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ‘లా నినా ప్రభావంతో మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌లో భారీ వర్షం పడొచ్చు. 

ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాన్‌‌‌‌‌‌‌‌ ముంచెత్తనుంది. దీనివల్ల 25 మిల్లీ మీటర్ల వాన కురుస్తుంది’ అని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఐసీసీ రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం విన్నర్‌‌‌‌‌‌‌‌ను తేల్చేందుకు కనీసం 10 ఓవర్ల మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అయినా ఆడించాలి. కానీ అది కూడా సాధ్యం కాకపోతే  ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను జాయింట్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌గా ప్రకటిస్తారు.