రైలు బోగీలో పొగలు..బీబీనగర్ ​రైల్వే స్టేషన్​లో ఘటన

రైలు బోగీలో పొగలు..బీబీనగర్ ​రైల్వే స్టేషన్​లో ఘటన
  • దిగి పరిగెత్తిన ప్రయాణికులు  

యాదాద్రి, వెలుగు : సికింద్రాబాద్​ నుంచి సిర్పూర్​ కాగజ్​నగర్ ​వెళ్లే రైలులో పొగలు కమ్ముకున్నాయి. గమనించిన లోకో పైలట్ రైలును బీబీనగర్​రైల్వే స్టేషన్​లో నిలిపివేశారు. పొగలు వస్తున్నాయని తెలుసుకున్న ప్రయాణికులు భయంతో రైలు దిగి దూరంగా పరిగెత్తారు.

రైల్వే ఇంజినీర్లు సంఘటన స్థలానికి చేరుకొని బ్రేకులు పట్టేయడం వల్లే పొగలు వచ్చాయని నిర్ధారించి రిపేర్లు చేసి రైలును పంపించారు. గతేడాది జూలై 2న రాత్రి హైదరాబాద్​నుంచి కొత్త ఢిల్లీకి వెళ్లే దక్షిణ్​ఎక్స్​ప్రెస్​బీబీనగర్​చేరుకున్నాక పొగలు వచ్చి పార్సిల్​బోగి కాలిపోయింది.

ఈ ఏడాది జూలై 7న కూడా ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​బొమ్మాయిపల్లికి చేరుకునే సమయానికి ఎస్ -4   బోగీలోని టాయ్​లెట్​వద్ద పొగలు వచ్చాయి. ఆ ఘటనలో మొత్తం ఐదు బోగీలు కాలిపోయిన సంగతి తెలిసిందే.