కారులో ఖాళీ లేదని బోనులో కూర్చోబెట్టారు... వైరల్​గా మారిన వీడియో

కారులో ఖాళీ లేదని బోనులో కూర్చోబెట్టారు... వైరల్​గా మారిన వీడియో

నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం ఎక్కడికైనా వెళ్లాలంటే బైక్​నే ఎంచుకుంటారు. అలాంటి వారి కోసం రతన్​టాటా అప్పట్లో నానో కారును లాంచ్​ చేశారు. అందులో వారు సౌకర్యంగా ప్రయాణించేవారు. మరి పాకిస్థాన్​కి చెందిన కార్ల తయారీ కంపెనీలు తమ దేశ పౌరుల కోసం ఇలాంటి ఆలోచన చేయట్లేదేమో.. ఈ వీడియో చూస్తే అలానే అనిపిస్తుంది.

వెనక కూర్చోబెట్టి ప్రయాణం..

ఇటీవల ఇన్ స్టాగ్రామ్​ లోని ఓ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ఓ కారులో ప్రయాణిస్తున్న కుటుంబం చిన్నారులను కారు వెనక వైపున ఉన్న పంజరంలాంటి భాగంలో ఉంచి ప్రయాణిస్తోంది. వెనక వైపు పిల్లలు ఇరుగ్గా కూర్చున్నారు. పాకిస్థాన్​లోని కరాచీ ప్రాంతంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కరాచీ చాలా పురోగతి సాధించిందని ఆ వీడియో తీస్తున్న వారు అన్నారు.  అలా ప్రయాణించడం ప్రమాదకరమని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్​ చేస్తున్నారు. ఈ వీడియోకు 28 లక్షలకు పైగా వ్యూస్​ వచ్చాయి.