
న్యూఢిల్లీ: ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోళ్లపై అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. కాంగ్రెస్ఎంపీ బల్వంత్ బస్వంత్ వాంఖడే అడిగిన ప్రశ్నకుగాను విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్దన్సింగ్శుక్రవారం లోక్సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఎఫ్35 కొనుగోళ్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అందులో పేర్కొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు.. ఎఫ్ 35 యుద్ధ విమానాలను ఇండియాకు సప్లయ్చేసేందుకు తాము రెడీగా ఉన్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ట్రంప్ తాజాగా భారత్పై 25 శాతం టారిఫ్లు, అదనంగా పెనాల్టీలు విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతున్నదన్నది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఎఫ్35 విమానాల కొనుగోళ్లపై కాంగ్రెస్ ఎంపీ వాంఖడే లోక్సభలో ప్రస్తావించగా.. అమెరికాతో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని కేంద్రం ప్రకటించింది.