బంగారం నుంచి సిగరెట్ల వరకు.. ఏప్రిల్ ఒకటి నుంచి పెరగనున్న ధరలు ఇవే..

బంగారం నుంచి సిగరెట్ల వరకు.. ఏప్రిల్ ఒకటి నుంచి పెరగనున్న ధరలు ఇవే..

కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే, కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరగున్నాయి. స్థానికంగా తయారైన వస్తువులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన టైంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. ప్రైవేట్ జెట్ విమానాలు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, ఆభరణాలు, హై-గ్లోస్ పేపర్, విటమిన్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు లాంటి వస్తువలతో పాటు సిగరెట్లు, బంగారం, ప్లాటినం లాంటి వస్తువులు కూడా ఉన్నాయి. 

కేంద్ర గత బడ్జెట్ లో చాలారకాల దిగుమతి వస్తువలపై టాక్స్ ను పెంచింది. కిచెన్ ఎలక్ట్రిక్ చిమ్నీలపై కస్టమ్స్ టాక్స్ 7.5 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. అంతేకాకుండా.. సిగరెట్లు, పాన్ మసాలా లాంటి పొగాకు ఉత్పత్తులపై జీఎస్‌టీ పరిహార సెస్ గరిష్ట రేటు, పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. జీఎస్‌టీ పరిహార సెస్‌ను ఇతర వస్తువులతో పాటు.. రిటైల్ అమ్మకం ధర సీలింగ్ రేటుకు జోడించింది. తాజాగా ఆమోదించిన ఆర్థిక బిల్లు 2023లో ప్రవేశపెట్టిన సవరణల్లో భాగంగా కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. 

దీంతో పాన్ మసాలా ఉత్పత్తిపై వేసే 135 శాతం టాక్స్ స్థానంలో యూనిట్ కు 51 శాతం జీఎస్ టీ ఉంటుంది. 1వేయి పొగాకు స్టి్క్ లకు రూ.4170+ 290 శాతం యూనిట్ రిటైల్ ఉంటుంది. ఇవి కాకుండా అత్యధిక జీఎస్టీ రేటు 28 శాతం పైన సెస్ వేయబోతున్నారు. దాంతో పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగుతాయి. ఈ లెక్కన ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి

తగ్గే వస్తువులు..

కొన్ని రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఆ జాబితాలో కెమెరా లెన్స్‌లు, మొబైల్ ఫోన్‌లు, ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రాలు, లిథియం-అయాన్ బ్యాటరీల కోసం ఉపయోగించే మెషీన్లు, ఈవీ ఇండస్ట్రీకి సంబంధించిన ముడి పదార్థాలు చౌకగా మారనున్నాయి. అంతేకాకుండా ఆటవస్తువులు, బైస్కిల్స్, టీవీ, మొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎల్ఈడీ టీవీలు, మిథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్, పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాల ధరలు కూడా తగ్గుతాయి.