లాక్డౌన్లో చాలామంది చేస్తున్న పని కొత్త వంటలు ట్రై చెయ్యడం. ఇందుకోసం ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇంటర్నెట్లో ఏ వంటకం గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు? ట్రెండింగ్లో టాప్లో నిలిచిన వంటకాలేంటంటే…
వెదురు చిగురు
లాక్డౌన్ టైంలో మాత్రం ఆసియా మొత్తంగా వెదురు చిగురుతో చేసే వంటకాల గురించి సెర్చ్ చేసినవాళ్ల సంఖ్య 4,850 శాతం పెరిగిందట. ఇదే స్థాయిలో బనానా బ్రెడ్ ఎలా తయారు చేయాలో కూడా వెతికారట.
వెదురు చిగురుతో ఏం చేస్తారంటే..
వెదురు మొక్కలు ఐదారు ఇంచులు పెరగ్గానే తెంపేస్తారు. ఈ టైంలో అవి సువాసనతో ఉండి, కరకరలాడుతుంటాయి. వీటిని చిన్నచిన్న ముక్కలుగా కట్చేసి సూప్లలో, ఫ్రైలలో వేసుకుంటారు. కొంతమంది నూడుల్స్లో, మష్రూమ్స్, పోర్క్ కూరల్లో కూడా వేసుకుంటారు.
పాన్కేక్, ఈస్టర్ కేక్
కేక్ ఫ్లఫ్ఫీగా రావాలంటే ఏం చేయాలని వెతికినవాళ్ల సంఖ్య 600 శాతం పెరిగింది.ఈస్టర్కు ముందు, ఈస్టర్ తర్వాత కూడా ఇంట్లోనే కేక్ తయారు చేయడమెలా? అనే లింక్స్ సెర్చ్ చేశారు.
హైదరాబాదీ దమ్ బిర్యానీ
మనదేశంలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వంటకం హైదరాబాద్ బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్, టేస్ట్తో ఎలా వండుకోవాలని వెతికిన వాళ్ల సంఖ్య ఎప్పటికంటే 540 శాతం పెరిగింది.
టోఫు వంటకాలు
కేక్ల తర్వాత ఎక్కువగా ట్రెండ్ అయిన వంటకం టోఫు. టోఫుతో ఎన్నిరకాల వెరైటీ వంటలు చేసుకోవచ్చని గూగుల్ సెర్చ్ చేసిన వాళ్లు 265 శాతం పెరిగారు.
బనానా బ్రెడ్
షుగర్ లేకుండా బనానాతో స్వీట్ బ్రెడ్ తయారు చేయడం ఎలాగో తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్ చేశారట. వెదురు చిగురు తర్వాత ఎక్కువ మంది సెర్చ్ చేసింది బనానా బ్రెడ్.
ఎగ్ స్పెషల్స్
ఎగ్తో చేసే రకరకాల స్పెషల్స్ కోసం గూగుల్లో వెతికారు. అయితే దీంతో పోలిస్తే ఎగ్ కాంబినేషన్లో చేసే వంటకాల గురించి సెర్చ్ చేసినవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.
పత్తాలేని సమ్మర్ స్పెషల్స్
సమ్మర్లో చేసుకునే కూల్ కూల్ ఐటమ్స్ గురించి చేసే సెర్చ్ చాలా తగ్గిపోయింది. చల్లటి పదార్థాలతో కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుందనే భయమే ఇందుకు కారణం కావచ్చంటున్నారు.
