ముంబై: కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు కరోనా టీకాలు అనుకొని పిల్లలకు వేసే వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్లాస్నగర్ పీహెచ్సీలో జరిగింది. ఆదివారం రాత్రి కొందరు దొంగలు బాత్రూమ్ కిటికీని తొలగించి పీహెచ్సీలోకి చొరబడ్డారు. ఫ్రిజ్ను ధ్వంసం చేసి అందులో ఉన్న పిల్లలకు వేసే వివిధ టీకాల 300 వయల్స్ను ఎత్తుకెళ్లారు. ఆ వయల్స్ మీద సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్టిక్కర్స్ ఉండడంతో అవే కరోనా టీకాలు అనుకొని వాటిని దొంగిలించారు. వీరు కొవిషీల్డ్ వ్యాక్సిన్లను ఎత్తుకెళ్లడానికే వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సీసీటీవీ కెమెరా డీవీఆర్, మానిటర్ను కూడా ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు సోమవారం ఉదయం పీహెచ్సీ సిబ్బంది వచ్చి చూడగా, ఫ్రిజ్ లో ఉన్న వ్యాక్సిన్లు నేలపై చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25 యాంటీ టీబీ వ్యాక్సిన్ వయల్స్, 17 కాఫ్ వయల్స్, 13 టెటానస్వయల్స్, 15 పోలియో వయల్స్, 30 రుబెల్లా వయల్స్, 270 రోటా వైరస్ వ్యాక్సిన్ల వయల్స్ మిస్ అయినట్లు గుర్తించారు. పీహెచ్సీలో కొవిడ్–19 వ్యాక్సినేషన్ జరుగుతోందని, ప్రస్తుతం వ్యాక్సిన్ షార్టేజ్ వల్ల వ్యాక్సినేషన్ను నిలిపివేశామని పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీపక్ చావ్హా తెలిపారు. పీహెచ్సీలో కొవిడ్ –19 వ్యాక్సిన్లు ఉన్నాయని భావించి వారు పీహెచ్సీలోకి చొరబడి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
