నెలకు రూ.55 కడితే...  ఏటా 36 వేల పెన్షన్ 

 నెలకు రూ.55 కడితే...  ఏటా 36 వేల పెన్షన్ 

ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రత్యేకత ఇది
కనీస హామీ పెన్షన్ నెలకు రూ.3వేలు


న్యూఢిల్లీ: పేద కార్మికులు, కూలీలు ఎక్కువ పెట్టుబడితో ఎక్కువ పెన్షన్​ పొందడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  (పీఎంఎస్​వైఎం)పేరుతో అద్భుతమైన స్కీమ్​ను  అమలు చేస్తోంది. ఇందులో చేరిన ప్రతి సభ్యునికి కనీస హామీ పెన్షన్ రూ. నెలకు 3వేలు చెల్లిస్తారు.   నెలకు రూ.55 చొప్పున చెల్లిస్తే ఏటా రూ.36 వేల పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పొందేందుకు వీలవుతుంది. ఎక్కువ ప్రీమియం కడితే ఏటా రూ.72 వేలు కూడా పొందవచ్చు. పీఎంఎస్​వైఎంలోని ప్రతి సభ్యునికి 60 ఏళ్ల వయసు దాటాక తర్వాత నెలకు రూ.3వేల చొప్పున పెన్షన్ ఇస్తారు. ఆ లెక్కన, ఒక వ్యక్తి సంవత్సరానికి రూ.36 వేలు పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పొందవచ్చు. వయసును బట్టి ప్రీమియం ఉంటుంది. యాన్యుటీని పొందుతున్న సమయంలో చందాదారుడు మరణించినట్లయితే జీవిత భాగస్వామి పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సగం మొత్తాన్ని కుటుంబ పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పొందేందుకు అర్హులు. కుటుంబ పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జీవిత భాగస్వామి (భార్య/భర్త) మాత్రమే అర్హులు.  లబ్ధిదారుడు ఏ కారణం వల్లనైనా 60 ఏళ్లు నిండకముందే శాశ్వతంగా వికలాంగుడు అయితే జీవిత భాగస్వామి  ద్వారా ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తంతోపాటు పెన్షన్ ఫండ్ ద్వారా వచ్చిన వడ్డీని తీసుకోవచ్చు.

ఎంత చెల్లించాలి? ఎవరు అర్హులు ?
మీకు 18 ఏళ్లు ఉంటే నెలకు రూ.55 చెల్లించాలి.  ప్రభుత్వం కూడా సమానమైన మొత్తాన్ని చెల్లిస్తుంది.  గరిష్టంగా మీరు నెలకు రూ.200 చెల్లించినా,  ప్రభుత్వం దానికి సమానమైన మొత్తాన్ని చెల్లిస్తుంది. 40 ఏళ్లకు మించిన వాళ్లు ఈ పథకానికి అర్హులు కారు. ఇంటి పనివాళ్లు , వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు,   లోడింగ్ చేసేవారు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, బట్టలు ఉతికేవారు, ఇంటి నౌకర్లు, చాకలివారు, రిక్షా పుల్లర్లు, భూమిలేని కార్మికులు,  వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, తోలు పని తదితర పనులు చేసేవాళ్లు ఈ స్కీముకు అర్హులు. మరో షరతులు ఏమిటంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్​ఓ), ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లేదా కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్​పీఎస్​) ద్వారా ప్రయోజనాలు పొందకూడదు. ఆదాయపు పన్నులు చెల్లించకూడదు.  నెలవారీ ఆదాయం నెలకు రూ.15 వేలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఆధార్ , సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నంబర్ లేదా జన్-ధన్ ఖాతా నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సెల్ఫ్​ వెరిఫికేషన్​ ఆధారంగా సమీప సీఎస్​సీలలో పీఎంఎస్​వైఎం కోసం  దరఖాస్తు చేసుకోవచ్చు.