- ప్రకటించిన మలేషియా టూరిజం బోర్డు
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది ఇండియా నుంచి తమ దేశానికి 5-6 లక్షల మంది టూరిస్టులు వచ్చే అవకాశం ఉందని మలేషియా టూరిజం ప్రమోషన్ బోర్డు తెలిపింది. కనీసం 15 కోట్ల మంది గ్లోబల్ టూరిస్ట్లను ఆకర్షించాలని టార్గెట్గా పెట్టుకున్నామని వెల్లడించింది. హైదరాబాద్ నుంచి వారానికి 15 విమానాలు మలేషియాకు వెళ్తున్నాయని తెలిపింది. “భారత్, మలేషియా మధ్య ఎయిర్ కనెక్టివిటీ చాలా బాగుంది. 2024 నాటికి భారతదేశం నుంచి టూరిస్టుల సంఖ్యను కరోనా పూర్వస్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం.
ఇందుకోసం మా దేశంలో ఎన్నో టూరిస్ట్ ప్రాజెక్టులను డెవెలప్ చేస్తున్నాం. కొన్ని షరతులతో ‘వీసా అన్ అరైవల్’ సదుపాయం కల్పిస్తున్నాం”అని మలేషియా టూరిజం ప్రమోషన్ బోర్డ్లో ఇంటర్నేషనల్ ప్రమోషన్ డివిజన్ ఆసియా/ఆఫ్రికా సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ అమిరుల్ రిజాల్ అబ్దుల్ రహీమ్ అన్నారు. హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన రోడ్షోలో ఆయన ఈ విషయాలు చెప్పారు. 2019లో భారతదేశం నుంచి 7.35 లక్షల మంది తమ దేశం వచ్చారని, 2024లో ఈ సంఖ్యను మరింత పెంచాలని అనుకుంటున్నామని వివరించారు.