ఆ ఎంపీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి : ప్రధాని మోదీ

ఆ ఎంపీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి : ప్రధాని మోదీ

 పార్లమెంట్ స‌మావేశాల్లో పాజిటివ్ స‌మాచారాన్ని ఇచ్చిన ఎంపీల‌ను అంద‌రూ ఎప్పటికి గుర్తు ఉంచుకుంటార‌ని ప్రధాని మోదీ అన్నారు. స‌భా స‌మావేశాల‌ను అడ్డుకునేవాళన చేసే వారిని ఎవ‌రూ గుర్తుంచుకోర‌ని అన్నారు. పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఈసారి జ‌రిగే బ‌డ్జెట్ స‌మావేశాల వ‌ల్ల లాభం చేకూరుతుంద‌న్న  మోదీ అన్నారు.

 ప్రజాస్వామ్యాన్ని అవ‌హేళ‌న చేస్తున్న ఎంపీలు త‌మ‌ను తాము ఆత్మపరిశీలన చేసుకోవాల‌ని మోదీ సూచించారు. బ‌డ్జెట్ స‌మావేశాల్లో పాజిటివ్ అంశాలను ప్రస్తావించేవారిని ప్రజలు గుర్తుంచుకుంటార‌ని మోదీ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని మోదీ చెప్పారు.