
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు హోం గార్డులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించే ఉత్కృష్ట సేవా పతకాలు , అతి ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికైనట్లు ఎప్పీ రాజేశ్చంద్ర గురువారం తెలిపారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినందుకు పతకాలకు ఎంపికయ్యారన్నారు. పిట్లం మండలంలో చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయగా హోం గార్డు మారుతి ప్రాణాలు కాపాడారు. కామారెడ్డిలో రైల్వే ట్రాక్పై ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయగా, హోం గార్డు వసంత్ ప్రాణాలు కాపాడారు. మల్లికార్జున్ ఎస్బీ విభాగంతో ఉత్తమ సేవలు అందిస్తున్నారు.
బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు సన్మానం
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి కర్షక్ బీఈడీ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన 2వ స్నాతకోత్సవంలో బంగారు పతకాలు సాధించారు. గురువారం కర్షక్ బీఈడీ కాలేజీలో సన్మానించారు. కాలేజీ సెక్రటరీ వి.విశ్వనాథం విద్యార్థులను సన్మానించారు. డైరెక్టర్లు పుండరీకాచారి, వీరయ్య, లక్ష్మయ్య, ప్రతాప్రెడ్డి, జనార్దన్రెడ్డి, పెంటయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కె. రషీద్, లెక్చరర్లు కిషన్, బాలు, బీమాగౌడ్, మమత, తయ్యబు, బాబురావు
తదితరులు పాల్గొన్నారు.