
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యలపై శుక్రవారం కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని త్రిమెన్ కమిటీ భేటీ కానుంది. రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని విభజన అంశాలు, సమస్యలపై ఈ మీటింగ్లో చర్చించనున్నారు. ఎజెండాలో నాలుగు విభజన అంశాలను చేర్చారు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ లో ఉన్న సంస్థలు, సింగరేణితో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజనపై చర్చించనున్నారు. ఈ కమిటీలో తెలంగాణ ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ రావత్ సభ్యులుగా ఉన్నారు.
సీఎంతో రామకృష్ణారావు భేటీ!
అప్పుల కోసం ఢిల్లీలో 3రోజులపాటు ఉన్న రామకృష్ణారావు గురువారం హైదరాబాద్కు చేరుకున్నారు. నేరుగా ప్రగతి భవన్కి వెళ్లి సీఎం కేసీఆర్ను కలిసినట్లు తెలిసింది. అప్పులతో పాటు కీలక విషయాలపై చర్చించినట్టు సమాచారం.