మంచిర్యాల జిల్లా : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందన సంఘటన శనివారం మంచిర్యాల జిల్లాలో జరిగింది. కోటపల్లి మండలం లక్ష్మీపూర్లో ప్రాణహిత బ్రిడ్జి వద్ద రెండు బైక్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు స్థానికులు. స్పాట్ లోనే ముగ్గురు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 2 బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందన్నారు.