V6 News

ముగ్గురు పంచాయతీ సెక్రటరీలు సస్పెన్షన్ : నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్

ముగ్గురు పంచాయతీ సెక్రటరీలు సస్పెన్షన్ : నాగర్ కర్నూల్ కలెక్టర్  బదావత్  సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నిధులు దుర్వినియోగం  చేసిన ముగ్గురు పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్  చేస్తూ నాగర్​కర్నూల్​ కలెక్టర్  బదావత్  సంతోష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శి పి కిషన్ ఈ గ్రామ స్వరాజ్  ఆన్​లైన్ లో బిల్లులు, ఓచర్లు, బుక్కు కాపీలకు బదులుగా రఫ్  పేపర్లు, వైట్  పేపర్లు, బ్యాంక్  పాస్ బుక్  అప్​లోడ్  చేశాడు. రూ.1,94,501 దుర్వినియోగం చేశాడని తేలింది. 

కొల్లాపూర్  మండలం సింగోటం పంచాయతీ కార్యదర్శి పి అర్జునయ్య ఈ గ్రామ స్వరాజ్  ఆన్​లైన్ లో చిత్తు కాగితాలను అప్​లోడ్  చేశాడు. రూ.12.97 లక్షలు దుర్వినియోగం చేశాడని తేలింది. ఇదే మండలం అంకిరావ్ పల్లి పంచాయతీ కార్యదర్శి ఆర్  ప్రేమ్​చంద్​ వెబ్ సైట్ లో పనులకు సంబంధించిన బిల్లులు కాకుండా ఇతర పేపర్లను అప్​లోడ్  చేయడంతో పాటు రూ.1,93, 915 దుర్వినియోగం చేసినట్లు తేలింది. ముగ్గురు విలేజ్​ సెక్రటరీలపై సస్పెన్షన్​ వేటు వేసినట్లు కలెక్టర్​ తెలిపారు.