ఈజీ మనీ కోసం డ్రగ్స్ అమ్ముతున్నారు..రూ. 2.60 లక్షల డ్రగ్స్ పట్టివేత

ఈజీ మనీ కోసం డ్రగ్స్ అమ్ముతున్నారు..రూ. 2.60 లక్షల డ్రగ్స్ పట్టివేత
  • పరారీలో నలుగురు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈజీ మనీ కోసం కొందరు డ్రగ్స్, గంజాయి​ అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్​టాస్క్​ఫోర్స్​టీమ్​ గురువారం సాయంత్రం ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. గుండ్లపోచంపల్లిలోని ఓ రూమ్​లో ఏడుగురు యువకులు రెంటుకు ఉంటున్నారు. 

వీరంతా ఈజీ మనీ కోసం డ్రగ్స్, గంజాయి అమ్మతున్నారు. ఎక్సైజ్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు గురువారం సాయంత్రం తనిఖీలు చేశారు. 2.11 కిలోల గంజాయి, 0.68 గ్రాముల ఎండీఎంఏ, 250 గ్రాముల హాష్​ఆయిల్​దొరికింది. షణ్ముఖ సాయి, జూపాక నందు, ఉమేశ్​ చంద్ర అనే ముగ్గురిని అరెస్ట్​ చేశారు. 

అరుణ్ కుమార్, అజయ్, సన్నీ, మేకల శివరాం అనే నలుగురు పరారీలో ఉన్నారని డీఎస్పీ తిరుపతి యాదవ్​ తెలిపారు. గ్రాము ఎండీఎంఏను రూ.6 వేలకు, హాష్​ఆయిల్​రూ.1,200కు 10 గ్రాముల గంజాయిని రూ.1,500కు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, డ్రగ్స్​ విలువ రూ.2.60లక్షలు ఉంటుందన్నారు.