జాతీయస్థాయి క్రీడలకు  అక్కాచెల్లెళ్లు ఎంపిక

జాతీయస్థాయి క్రీడలకు  అక్కాచెల్లెళ్లు ఎంపిక

మక్తల్, వెలుగు : ఒకే కుటుంబానికి  చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు  జాతీయస్థాయి సివిల్ సర్వీసెస్  క్రీడలకు  ఎంపికయ్యారు. ఈనెల 21న సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో  జరిగిన ఏఐఎస్​(ప్రభుత్వ ఉద్యోగుల) రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో  ప్రతిభను  కనబరిచి  జాతీయ  క్రీడలకు ఎంపికయ్యారు. కర్ని జడ్పీహెచ్ఎస్ లో ​పీఈటీగా పనిచేస్తున్న పట్టణానికి  చెందిన రూప  మహిళా విభాగం లాంగ్ జంప్​లో ప్రథమ స్థానం  సాధించింది.

మాగనూర్ లో టీచర్ గా పనిచేస్తున్న  దీప  800 మీటర్లు, కొత్తకోటలో వెటర్నరీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న  శిల్ప 200 మీటర్ల పరుగులో ప్రథమ స్థానంలో నిలిచారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చండీఘడ్​లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారు. వీరిని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరి ,  బీజేపీ నాయకులు కొండయ్య,  క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు నరసింహ గౌడ్, తాన్ సింగ్, సత్య ఆంజనేయులు, క్రీడాకారులు అభినందించారు.