చూస్తుండగానే కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం

 చూస్తుండగానే కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం

ఏపీ ప్రకాశం జిల్లా దోర్నాలలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే వాసవి లాడ్జి భవనం కూలిపోయింది. భవనం పక్కనే నూతనంగా నిర్మాణం చేపట్టేందుకు తీసిన పునాది గుంతల కారణంగా భవనంలో పగుళ్లు ఏర్పడ్డాయి. పగుళ్ళ కారణంగా బిల్లింగ్ ఓ పక్కకు  ఒరగడాన్ని లాడ్జియాజమాన్యం గమనించింది. దీంతో  హుటా హుటిన లాడ్జిని ఖాళీ చేయడంతో ప్రాణాపాయం తప్పింది.