అలంపూర్​ హుండీ ఆదాయం రూ.57 లక్షలు

అలంపూర్​ హుండీ ఆదాయం రూ.57 లక్షలు

అలంపూర్, వెలుగు: అలంపూర్  జోగులాంబ అమ్మవారి ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. అమ్మవారి హుండీ ద్వారా రూ. 57,99,176 ఆదాయం వచ్చినట్లు ఈవో పురేంధర్ కుమార్  తెలిపారు. 70 తులాల మిశ్రమ వెండి, 65 గ్రాముల మిశ్రమ బంగారం వచ్చిందని చెప్పారు.

 ఎండోమెంట్  ఇన్స్​పెక్టర్​ వెంకటేశ్వరమ్మ, ఆలయ చైర్మన్  చిన్న కృష్ణయ్య, బ్యాంక్​ మేనేజర్  అంజలి, అసిస్టెంట్ మేనేజర్లు వెంకటేశ్వర్లు, వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు.