టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square). దర్శకుడు మల్లిక్ రామ్(Mallik Ram) తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టిల్లు కలెక్షన్స్:
వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.125 కోట్ల మార్కును దాటేసింది.రిలీజైన 18 రోజుల్లో రూ.125.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని మేకర్స్ తెలిపారు.“డబుల్ బ్లాక్బస్టర్ టిల్లు స్క్వేర్ కొత్త ల్యాండ్ మార్క్ చేరింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ఇంత భారీ బ్లాక్బస్టర్ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్” అంటూ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. తర్వాత వచ్చే టిల్లు క్యూబ్ మరింత భారీగా, బెటర్గా ఉంటుందంటూ కూడా తెలిపారు.
The double Blockbuster #TilluSquare has reached a new landmark, grossing over 𝟏𝟐𝟓 𝐂𝐑 at the worldwide box office! 🔥
— Sithara Entertainments (@SitharaEnts) April 16, 2024
Thanks to you all for giving us such a huge blockbuster success and the next one will be even bigger & better! ❤️🔥💥
STAR 🌟 BOY #Siddu @anupamahere… pic.twitter.com/ZK1mgwuoXD
టిల్లు ఓటీటీ:
ఇదిలా ఉండగా..టిల్లు స్క్వేర్ సినిమా నెలలోపే ఓటీటీలోకి రానుందని సమాచారం. ఈ నెల (ఏప్రిల్ 26న) ఓటీటిలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే, రిలీజ్కు ముందే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం చేసుకున్నట్లు టాక్. దీంతో త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.