ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. తాజాగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో 58వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. అదుపు తప్పినపోలీస్ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు . క్షతగాత్రులను విజిలెన్స్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు,
ఇటీవల తిరుమల ఘాట్ రోడ్లలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తుండడం తెలిసిందే.ఈ నెలలో దీనితో కలుపుకొని ఆరు ప్రమాదాలు నమోదయ్యాయి. ఇటీవల ఒకే రోజు రెండు ప్రమాదాలు జరిగాయి. ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఘటనలు జరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.