తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూ లైన్లలో భక్తులు ఎదురు చూస్తున్నారు. స్వామి వారి దర్శనానికి 25 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. నిన్న 67 వేల 949 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 70 లక్షల ఆదాయం రాగా, 39 వేల 837 మంది తలనీలాలు సమర్పించారు. కాగా ఈరోజు, రేపు శని, ఆదివారాలు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.