'టైటాన్ స్మార్ట్ ల్యాబ్స్' పేరుతో  ఇంజనీరింగ్ సెంటర్​

'టైటాన్ స్మార్ట్ ల్యాబ్స్' పేరుతో  ఇంజనీరింగ్ సెంటర్​

హైదరాబాద్, వెలుగు:  టాటా గ్రూప్, తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) జాయింట్ వెంచర్ అయిన టైటాన్.. స్మార్ట్​వాచీల వంటి ఎలక్ట్రానిక్​ ప్రొడక్టులను రూపొందించడానికి హైదరాబాద్​లో 'టైటాన్ స్మార్ట్ ల్యాబ్స్' పేరుతో  ఇంజనీరింగ్ సెంటర్​ను ప్రారంభించింది. టైటాన్ ఎండీ వెంకటరామన్, సీఈఓ సుపర్ణ మిత్ర, ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ, వాచ్‌‌లు & వేరబుల్స్ హెడ్ రాజ్ నెరవతి కార్యక్రమంలో పాల్గొన్నారు. చీఫ్​ గెస్టుగా వచ్చిన తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ హైదరాబాద్​లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు ఎంతో ప్రగతిని సాధిస్తున్నాయని చెప్పారు.

టాటాకు జంషెడ్​పూర్​ తరువాత ఎక్కువ మంది హైదరాబాద్​లోనే ఉన్నారని చెప్పారు. ఇతర మెట్రోల కంటే ఇక్కడే ట్యాలెంట్, వనరులు ఉన్నాయని అన్నారు.  ఈ సందర్భంగా సుపర్ణ మిత్ర మాట్లాడుతూ స్మార్ట్ వేరబుల్ అండ్ హియరబుల్ ఇండస్ట్రీలో  లీడర్‌‌గా ఎదగాలనే టార్గెట్​తో పనిచేస్తున్నామని చెప్పారు.     ప్రస్తుతం ఇక్కడ 80 మంది పనిచేస్తారని, త్వరలో వీరి సంఖ్యను మూడు రెట్లు పెంచుతామని రాజ్​ చెప్పారు చెప్పారు.గత ఏడాదితో పోలిస్తే తమ ఆదాయం 5 రెట్లు పెరిగిందని అన్నారు.  కంపెనీ పోర్ట్‌‌ఫోలియోలో స్మార్ట్ వాచ్‌‌లు, స్మార్ట్ క్లాక్, నెక్ బ్యాండ్‌‌లు ఉంటాయని అన్నారు.