
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ కోల్కతాలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. నగరంలోని న్యూ టౌన్లో ఫ్లాట్లు ఇప్పిస్తానని సీనియర్ సిటిజన్లను మోసగించిన కేసులో విచారణకు పిలిచినట్టు ఒక సీనియర్ అధికారి చెప్పారు. ఆమెను విచారించి మొత్తం ప్రక్రియను రికార్డు చేస్తామని తెలిపారు. "కంపెనీలో ఆమె పాత్ర గురించి మేము ఆమెను ప్రశ్నిస్తాము. మేము ఆమె కోసం అనేక ప్రశ్నలను జాబితా చేసాము. మొత్తం ప్రక్రియ రికార్డ్ చేయబడుతుంది. మేము ఆమె స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తాము" అని అధికారి చెప్పారు.
న్యూ టౌన్ ప్రాంతంలో ఫ్లాట్లు ఇప్పిస్తానని రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసిందని ఆరోపిస్తూ సీనియర్ సిటిజన్ల బృందం ఇటీవల ఫిర్యాదు చేయడంపై ఈడీ విచారణ చేపట్టింది. జహాన్ మాత్రం తాను ఎలాంటి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. మార్చి 2017 లో కంపెనీ డైరెక్టర్షిప్కు రాజీనామా చేసినట్లు చెప్పారు. తాను కంపెనీ నుంచి రుణం తీసుకున్నానని, మే 2017 లో వడ్డీతో సహా తిరిగి చెల్లించానని ఆమె వివరించారు.
#WATCH | West Bengal | TMC MP and actress Nussrat Jahan arrives at the ED office in Kolkata.
— ANI (@ANI) September 12, 2023
She has been summoned by the Agency regarding a complaint filed by a group of senior citizens accusing a real estate company of cheating by promising them flats in the New Town of… pic.twitter.com/Drf9S56cBp