ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.. తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిమాండ్​

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి..  తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిమాండ్​

 నిర్మల్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వెంటనే యూనియన్లను పునరుద్ధరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నిర్మల్ లో టీఎంయూ ఆదిలాబాద్ రీజినల్ సమావేశం నిర్వహించారు. చీఫ్​ గెస్ట్​గా హాజరైన థామస్ రెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. కార్మికులకు అత్యవసర సమయాల్లో సెలవులు కూడా మంజూరు చేయడం లేదని, 8 గంటల పని కాకుండా 12 నుంచి 14 గంటల వరకు పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగులు దాచుకున్న సీసీఎస్ డబ్బులను యాజమాన్యం వాడుకుందని, ఆ డబ్బులను కార్మికులకు  వెంటనే చెల్లించాలన్నారు. ఆర్టీసీ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

రీజినల్ సెక్రటరీగా గంగాధర్

తెలంగాణ మజ్దూర్ యూనియన్ అదిలాబాద్ రీజియన్ సెక్రటరీగా నిర్మల్ డిపోకు చెందిన ఆర్.గంగాధర్​ను ఎన్నుకున్నారు. గంగాధర్​కు థామస్ రెడ్డి నియామక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు కమలాకర్ గౌడ్, కోశాధికారి రాఘవరెడ్డి, సలహాదారులు యాదయ్య, రాష్ట్ర కార్యదర్శి 
ఎల్.రమేశ్, పలు డిపోల కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.