చెన్నై: కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాయి. ఒమిక్రాన్ విజృంభిస్తున్నా కొందరు జనం ఏ మాత్రం లెక్క చేయడంలేదు. బహిరంగ ప్రదేశాల్లో సైతం మాస్క్లు లేకుండానే తిరుగుతున్నారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిని చూసి తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన పని ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం స్టాలిన్ సెక్రటేరియట్ కు బయలుదేరారు. అన్నా సలై ప్రాంతానికి చేరుకునే సరికి అక్కడ చాలా మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్న విషయం గ్రహించాడు. దీంతో స్టాలిన్ వెంటనే కాన్వాయ్ను పక్కకు ఆపి వారి దగ్గరకు వెళ్లారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి స్వయంగా మాస్కులు తొడిగారు. మాస్కుల ప్రాధాన్యం వివరిస్తూ అక్కడున్న వారికి మాస్క్ లు పంచిపెట్టారు. అనంతరం అనంతరం ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తో కలిసి రివ్యూ మీటింగ్కు బయలుదేరి వెళ్లారు.
கொரோனா மற்றும் ஒமைக்ரான் வைரஸ் தொற்று பரவல் தடுப்பு நடவடிக்கையாக சென்னை மாநகரின் பல்வேறு இடங்களுக்கு மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் நேரில் சென்று, பொதுமக்களுக்கு முகக்கவசம் வழங்கி, விழிப்புணர்வு ஏற்படுத்தினார்.#Covid_19 #Omicron pic.twitter.com/fCNDcaNuZ1
— CMOTamilNadu (@CMOTamilnadu) January 4, 2022
మరిన్ని వార్తల కోసం..