టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో సిల్వర్ మెడల్

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో  సిల్వర్ మెడల్

ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్స్ లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ సాధించాడు. భారత్ ఖాతాలో మరో పతకం చేర్చాడు. 57కేజీల విభాగంలో.. రష్యన్ రెజ్లర్.. జౌ రొగేవ్ తో జరిగిన ఫైనల్స్ లో.. 7-4తేడాతో రవి కుమార్ ఓడిపోయాడు. రష్యన్ రెజ్లర్ కు తీవ్రంగా పోటీ ఇచ్చాడు రవికుమార్. 9 ఏళ్ల తర్వాత.. రెజ్లింగ్ లో భారత్ తరపున ఫైనల్స్ కు చేరిన రెండో ఆటగాడిగా రవి కుమార్ దహియా రికార్డ్ సృష్టించాడు.